అదుపు తప్పి కారు పల్టీ : ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-07-26T07:08:03+05:30 IST

వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొని రోడ్డుకు అడ్డంపడిన సంఘటనలో బాలిక మృతిచెందింది. ఈ సంఘటన మండలంలోని చీకటిగూడెం వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది.

అదుపు తప్పి కారు పల్టీ : ఒకరి మృతి
ప్రమాదంలో రోడ్డుకు అడ్డంగా పడిన కారు

కేతేపల్లి, జూలై 25: వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొని రోడ్డుకు అడ్డంపడిన సంఘటనలో బాలిక మృతిచెందింది. ఈ సంఘటన మండలంలోని చీకటిగూడెం వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు చెందిన సూరిశెట్టి వెంకటపవన్‌ భార్య సరిత, కూతుళ్లు శ్రేయ, తన్వీలతో కలిసి వారాంతపు సెలవులకు శనివారం ఏపీలోని తన స్వస్థలానికి వెళ్లారు. తిరిగి కుటుంబసమేతంగా హైదరాబాద్‌కు వస్తుండగా చీకటిగూడెం వద్ద డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొడుతూ అవతలి వైపు పడింది. ప్రమాదంలో పవన్‌ చిన్న కూతురు తాన్వి(12) తీవ్రంగా గాయపడింది. గాయపడిన బాలికను మరో కారులో నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే మృతిచెందింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎ్‌సఐ రాధారపు అంజయ్య తెలిపారు. 


Updated Date - 2021-07-26T07:08:03+05:30 IST