కారు బోల్తా : బాలుడు మృతి
ABN , First Publish Date - 2022-05-27T06:48:08+05:30 IST
కారు బోల్తాపడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
- ముగ్గురికి తీవ్ర గాయాలు
తవణంపల్లె, మే 26: కారు బోల్తాపడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని తెల్లగుండ్లపల్లె గ్రామ సమీపంలో తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. కోల్కతాకు చెందిన సుధాకర్ పాటియా, బెంగళూరుకు చెందిన గోపాల్ జైన్ కుటుంబాలకు చెందిన ఏడుగురు కలిసి కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరిగి వెళుతుండగా తెల్లగుండ్లపల్లె గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ఆరేళ్ల బాలుడు అంకిత్ జైన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వాస్ప త్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం వేలూరు సీఎంసీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.