కారును ఢీకొన్న కంటైనర్‌.. తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2021-10-29T05:01:28+05:30 IST

మండల పరిధిలోని జాతీయరహదారిపై మనుబోలు పెద్ద వంతెన వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది.

కారును ఢీకొన్న కంటైనర్‌.. తప్పిన ప్రమాదం
ప్రమాదంలో దెబ్బతిన్న కారు

మనుబోలు, అక్టోబరు 28: మండల పరిధిలోని జాతీయరహదారిపై మనుబోలు పెద్ద వంతెన వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంకు చెందిన బీవీఎన్‌ శర్మ చెన్నైకి వెళ్లి,  తిరుగు ప్రయాణంలో కారులో భార్య, కుమారుడితో కలిసి నర్సీపట్నం వెళుతున్నారు. ఈ క్రమంలో మనుబోలు వద్ద ముందు వెళుతున్న కంటైనర్‌ను అధిగమించే ప్రయత్నంలో కారు మలుపుతిప్పడంతో కంటైనర్‌ కారును వెనుకభాగంలో ఢీకొనడంతో కారు అదుపుతప్పి వంతెన వద్దనున్న డివైడర్‌ను ఢీకొన్నట్లు బాధితులు తెలిపారు. దీంతో కారు ముందుబాగం దెబ్బతిని యాక్సిల్‌ విరిగిపోయింది. వంతెనపై ప్రమాదంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వెంటనే పోలీసులు ప్రమాదస్థలికి చేరుకున్నారు. అయితే ప్రమాదంలో ఎవరికి  గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు కారు, కంటైనర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-10-29T05:01:28+05:30 IST