కాలువలో పల్టీ కొట్టిన కారు

ABN , First Publish Date - 2021-08-30T01:11:44+05:30 IST

ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామ సమీపంలో ఆదివారం ఖమ్మం-బోనకల్‌ రోడ్డుపై కారు అదుపుతప్పి తుమ్మలమ్మ

కాలువలో పల్టీ కొట్టిన కారు

ఖమ్మం: ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామ సమీపంలో ఆదివారం ఖమ్మం-బోనకల్‌ రోడ్డుపై కారు అదుపుతప్పి తుమ్మలమ్మ చెరువు మెట్ట కాలువలోకి పల్టీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి అందరూ క్షేమంగా బయటపడ్డారు. ఖమ్మం నగరానికి చెందిన శ్రీనివాసరావు తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా జగన్నాధపురం గ్రామం దాటగానే వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కాలువలోకి పల్టీ కొట్టింది. ఈ సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు అప్రమత్తమై బోల్తాపడిన కారులోని వారిని సురక్షితంగా బయటకు తీశారు. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2021-08-30T01:11:44+05:30 IST