కారులో చెలరేగిన మంటలు.. తప్పిన పెనుప్రమాదం

ABN , First Publish Date - 2021-09-12T23:15:37+05:30 IST

కారులో చెలరేగిన మంటలు.. తప్పిన పెనుప్రమాదం

కారులో చెలరేగిన మంటలు.. తప్పిన పెనుప్రమాదం

కొడంగల్‌: కారులో ఆకస్మత్తుగా మంటలు చెలరేగిన ఘటన వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మండలం కస్తూర్‌పల్లి సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. హైదరాబాద్‌లోని అత్తాపూర్‌కు చెందిన పాండు రెనాల్డ్‌ డస్టర్‌ కారులో తన స్నేహితులు  శ్రీనివాస్‌రెడ్డి, సోను, రాజులతో కలిసి గుర్బర్గకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కస్తూర్‌పల్లి సమీపంలోకి రాగానే కారులో నుంచి పొగలు రావడం గమనించి వారంతా వెంటనే కారులోంచి దిగిపోయారు. అనంతరం కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు  ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఫైర్‌సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేశారు.  

Updated Date - 2021-09-12T23:15:37+05:30 IST