కెప్టెన్ అమరీందర్ ఓ నమ్మకద్రోహి : సిద్ధూ
ABN , First Publish Date - 2022-01-04T23:11:41+05:30 IST
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ ఆ రాష్ట్ర
చండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ సింగ్ నమ్మకద్రోహి అని చెప్పారు. ఓ టీవీ ఛానల్కు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
కెప్టెన్ అమరీందర్ సింగ్ అంటే మీకు ఇష్టం ఉండదా? అని ప్రశ్నించినపుడు సిద్ధూ స్పందిస్తూ, ప్రత్యర్థికి కీలుబొమ్మగా వ్యవహరించే కెప్టెన్ నమ్మకద్రోహి అని చెప్పారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ సత్తువ కోల్పోయిన వ్యక్తి అని మండిపడ్డారు. ఆయన సిద్దాంతాలను అమ్ముకున్నారన్నారు. తాము ఎంత కాలం గోప్యంగా ఉండగలుగుతామని, ఆయనకు చెప్పేందుకు చాలాసార్లు ప్రయత్నించామని చెప్పారు. తాము ఎంత ప్రయత్నించినా ఏమీ జరగలేదన్నారు. తాను సమస్యలపై పోరాడతానని చెప్పారు.
పంజాబ్ శాసన సభ ఎన్నికల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇస్తున్న హామీల గురించి ప్రస్తావిస్తూ, 18 ఏళ్ళ వయసుగలవారికి రూ.1,000 చొప్పున ఇస్తామని కే్జ్రీవాల్ చెప్తున్నారని, 17 ఏళ్ళ వయసుగలవారికి ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు. కేజ్రీవాల్ కేవలం ఎన్నికల విన్యాసాలు మాత్రమే చేస్తున్నారన్నారు.