ప్రజల తీర్పుపై పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-03-10T20:29:00+05:30 IST

ఓటమిపై పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ స్థాపకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టు ప్రకటించారు. ప్రజలు కుల, మతాలకు అతీతంగా ఓ

ప్రజల తీర్పుపై పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ఇంటర్నెట్ డెస్క్: ఓటమిపై పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ స్థాపకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టు ప్రకటించారు. ప్రజలు కుల, మతాలకు అతీతంగా ఓటు వేసి, నిజమైన పంజాబీయత్  స్ఫూర్తిని ప్రదర్శించినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా పంజాబ్‌ను ఊడ్చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులకు, ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవత్ మాన్‌కు అభినందనలు తెలిపారు. కాగా.. కెప్టెన్ అమరీందర్ సింగ్  ఆప్ అభ్యర్థి అజిత్ పాల్ సింగ్ కోహ్లీ చేతిలో 19,873ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.  






Updated Date - 2022-03-10T20:29:00+05:30 IST