రాజధానిపై హైకోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం: సుంకర పద్మ

ABN , First Publish Date - 2020-08-14T20:54:39+05:30 IST

ఏపీ రాజధాని తరలింపు అంశంపై హైకోర్టు జారీ చేసిన తాజా ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని ఏపీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు, మహిళా జేఏసీ నాయకురాలు సుంకర పద్మశ్రీ

రాజధానిపై హైకోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం: సుంకర పద్మ

అమరావతి: ఏపీ రాజధాని తరలింపు అంశంపై హైకోర్టు జారీ చేసిన తాజా ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని ఏపీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు, మహిళా జేఏసీ నాయకురాలు సుంకర పద్మశ్రీ ప్రకటించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించక తప్పదని అన్నారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆమె.. న్యాయమైన ఈ పోరాటంలో రైతులు తప్పక విజయం సాధిస్తారని పేర్కొన్నారు. అమరావతి రైతులు శాంతియుతంగా, గాంధేయ పద్ధతిలో ఈ పోరాటంలో విజయం సాధించేవరకు ఉద్యమించాలని కోరుతున్నానని పద్మశ్రీ అన్నారు. రైతులు, మహిళల న్యాయమైన పోరాటానికి రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టకు పోకుండా రాజధాని రైతులతో నేరుగా చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించాలని సుంకర పద్మ శ్రీ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-08-14T20:54:39+05:30 IST