బొత్స వ్యాఖ్యలపై రాజధాని మహిళా రైతుల ఆగ్రహం

ABN , First Publish Date - 2021-08-29T22:49:14+05:30 IST

మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై రాజధాని మహిళా రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్సకు రాజధానిలో ఎన్ని గ్రామాలున్నాయో కూడా తెలియదని ఎద్దేవాచేశారు.

బొత్స వ్యాఖ్యలపై రాజధాని మహిళా రైతుల ఆగ్రహం

అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై రాజధాని మహిళా రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్సకు రాజధానిలో ఎన్ని గ్రామాలున్నాయో కూడా తెలియదని ఎద్దేవాచేశారు. తన మంత్రి పదవి పోతుందనే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బొత్సను కేబినెట్‌ నుంచి తొలగించాలని రాజధాని మహిళా రైతుల డిమాండ్ చేస్తున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు చేసి తీరుతామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అమరావతి రైతులకు ఒనగూరే అంశాలకు కట్టుబడివున్నామన్నారు. లేజిస్లేటివ్ రాజధాని అమరావతిలోనే ఉంటుందని తెలిపారు. కేవలం ఇరవై గ్రామాలకో, ఓ సామాజిక వర్గానికో రాష్ట్ర భవిష్యత్తు పరిమితం కావాలా? అని బొత్స ప్రశ్నించారు. 

Updated Date - 2021-08-29T22:49:14+05:30 IST