రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రాలదే: బొత్స

ABN , First Publish Date - 2022-03-04T01:13:43+05:30 IST

దేశంలో రాష్ట్రాలకు రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలదేనని

రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రాలదే: బొత్స

అమరావతి: దేశంలో రాష్ట్రాలకు రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలదేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అధికార వికేంద్రీక‌ర‌ణ తమ ప్రభుత్వ విధానన్నారు. తమ విధానానికే క‌ట్టుబ‌డి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. రిపీల్ యాక్ట్‌లో చెప్పినట్టు దానికి క‌ట్టుబ‌డే ఉన్నాన్నారు. చ‌ట్టప‌రంగా ఉన్న అవ‌కాశాలను ప‌రిశీలించి అదే విధంగా చేస్తామన్నారు. హైకోర్టు తీర్పుపై న్యాయ సలహా తీసుకుంటామన్నారు. సుప్రీంకోర్టుకి వెళ్లాలా లేదా అనేది ఆలోచిస్తామన్నారు. అమరావతిపై హైకోర్టు తీర్పు విషయంలో సీఎం ఎందుకు క్షమాపణ చెప్పాలని మంత్రి బొత్స అన్నారు.


Updated Date - 2022-03-04T01:13:43+05:30 IST