సుప్రీంకోర్టులో వాదిస్తూ డెస్క్టాప్ కొనలేరా?
ABN , First Publish Date - 2022-01-18T06:53:13+05:30 IST
‘‘సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. కనీసం డెస్క్టాప్ కొనలేరా?
న్యూఢిల్లీ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ‘‘సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. కనీసం డెస్క్టాప్ కొనలేరా? ఐపాడ్, ల్యాప్టాప్ లాంటివి మీ దగ్గర లేవా?’’ అంటూ న్యాయవాదుల వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. న్యాయవాదులు స్మార్ట్/మొబైల్ ఫోన్ల ద్వారా విచారణకు హాజరవుతుండడంతో సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది.
‘‘న్యాయవాదుల ముఖాలు కనిపించవు. వాయి్సలో స్పష్టత ఉండదు. వారు చెప్పేది వినలేకపోతున్నాం’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. కింది కోర్టు న్యాయవాదులు ఇలా మొబైల్ఫోన్లను వాడుతున్నారంటే అర్థం చేసుకోగలమని, సుప్రీంకోర్టు ముందు హాజరవుతున్నప్పుడు కనీసం డెస్క్టాప్ కొనలేరా? అని ప్రశ్నించారు. ఉదయం నుంచి పది కేసుల్లో ఇదే తంతుతో తాము విసిగిపోయామని ఆయన అన్నారు.