సుదీర్ఘకాలం దేశాన్ని లాక్డౌన్లో ఉంచడం సాధ్యమయ్యే పనికాదు : కేజ్రీవాల్
ABN , First Publish Date - 2020-05-30T19:22:39+05:30 IST
ఢిల్లీ ప్రజలు కరోనా కారణంగా భయపడాల్సిన పనేమీ లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభయమిచ్చారు. మహమ్మారి
న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రజలు కరోనా కారణంగా భయపడాల్సిన పనేమీ లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభయమిచ్చారు. మహమ్మారి కట్టడికి నాలుగు దశల్లో చర్యలు తీసుకుంటున్నామని ఆయన ప్రజలకు భరోసా కల్పించారు. ‘‘ఇది ఆందోళన కలిగించే అంశమే. కానీ భయపడాల్సిన పనిలేదు. కరోనా మహమ్మారికి నాలుగు దశల్లో కట్టడి చర్యలు తీసుకుంటున్నాం. ఆ విషయంలో మాత్రం మీకు నేను భరోసా కల్పిస్తున్నా’’ అని ఆయన స్పష్టం చేశారు.
దేశంలో సుదీర్ఘ కాలం లాక్డౌన్ విధించడం సాధ్యం కాదని, అది కట్టడికి శాశ్వత పరిష్కారం కూడా కాదని, తగు జాగ్రత్తలతో ప్రజలు వారి వారి జీవితాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. ‘‘ఢిల్లీలో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు ఉన్నాయన్నది వాస్తవం. దాన్ని మేము అంగీకరిస్తున్నాం. కానీ భయపడాల్సిన పనేమీ లేదు. ప్రభుత్వం పక్షాన మేము అన్ని రకాలుగా సంసిద్ధతతోనే ఉన్నామని ప్రజలకు భరోసా కల్పిస్తున్నాం. దేశాన్ని శాశ్వతంగా లాక్డౌన్లో ఉంచడం సాధ్యమయ్యే పనికాదు’’ అని వీడియో కాన్ఫరెన్స్లో కేజ్రీవాల్ పేర్కొన్నారు.