ప్రైవేట్‌ బస్సులో గంజాయి తరలింపు

ABN , First Publish Date - 2020-07-06T09:56:41+05:30 IST

నగరానికి అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పేట్‌బషీరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

ప్రైవేట్‌ బస్సులో గంజాయి తరలింపు

పేట్‌బషీరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): నగరానికి అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పేట్‌బషీరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనకాపల్లికి చెందిన సిరాజుద్దీన్‌(33)ఆరెంజ్‌ ట్రావెల్‌ బస్సులో నగరానికి శనివారం వచ్చాడు. దూలపల్లిలో బస్సు దిగాక లగేజీ చార్జీ చెల్లింపు విషయంలో డ్రైవర్‌కు అతడి మధ్య గొడవ జరిగింది. బస్సు డ్రైవర్‌ డయల్‌ 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశాడు. పేట్‌బషీరాబాద్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లగేజీని పరిశీలించగా 50 కిలోల గంజాయి బయటపడింది. సిరాజుద్దీన్‌ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-07-06T09:56:41+05:30 IST