ఏపీకి వెళ్లే టీఎస్ఆర్టీసీ బస్సుల రద్దు: ఎండీ
ABN , First Publish Date - 2021-05-07T09:51:29+05:30 IST
ఏపీకి వెళ్లే టీఎస్ఆర్టీసీ బస్సుల రద్దు: ఎండీ
హైదరాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్నం నుంచే కర్ఫ్యూను అమలు చేస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి ఇక్కడి నుంచి వెళ్లే టీ ఎస్ఆర్టీసీ బస్సులను రద్దు చేసినట్లు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సంస్థ ఎండీ సునీల్ శర్మ గురువారం ప్రకటించారు. రాష్ట్రం నుంచి ఏపీకి దా దాపు 900 వరకు బస్సులు నడుస్తుంటాయి. ఏపీలో మధ్యాహ్నం నుంచే కర్ఫ్యూ విధించడంతో ఏపీ సరిహద్దుల వద్ద టీఎ్సఆర్టీసీ బస్సులను నిలిపివేస్తున్నారు. దీంతోబస్సులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎండీ తెలిపారు.