పలు రైళ్ల రద్దు

ABN , First Publish Date - 2021-03-10T00:17:20+05:30 IST

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో జరుగుతున్నరైల్వే ట్రాక్ పనుల కారణంగా పలు

పలు రైళ్ల రద్దు

సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో జరుగుతున్నరైల్వే ట్రాక్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈనెల 12న ముంబై నుంచి ఆదిలాబాద్‌ వెళ్లే రైలును రద్దు చేశారు. 3న ఆదిలాబాద్ నుంచి ముంబైకి వెళ్లే ప్రత్యేక రైలును రద్దు చేశారు. 13న ముంబై నుంచి సికింద్రాబాద్‌ వచ్చే ప్రత్యేక రైలును రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రయాణికులందరూ ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణాలు చేసుకోవాలని కోరింది. 

Updated Date - 2021-03-10T00:17:20+05:30 IST