ప్రయాణికులు లేక 28 రైళ్ల రద్దు

ABN , First Publish Date - 2021-05-07T09:50:44+05:30 IST

ప్రయాణికుల ఆదరణ లేక, నిర్దేశిత లక్ష్యం మేర ఆదాయం రాక 28 ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 7న నడిచే

ప్రయాణికులు లేక 28 రైళ్ల రద్దు

హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల ఆదరణ లేక, నిర్దేశిత లక్ష్యం మేర ఆదాయం రాక 28 ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 7న నడిచే తిరుపతి-విశాఖపట్నం, సికింద్రాబాద్‌-కర్నూల్‌ సిటీ, కర్నూల్‌ సిటీ-సికింద్రాబాద్‌, కాకినాడ టౌన్‌-రేణిగుంట, విజయవాడ-లింగంపల్లి, విజయవాడ-గూడూరు, నాందెడ్‌-జమ్ముతావి, బిట్రగుంట-చెన్నై సెంట్రల్‌, చెన్నై సెంట్రల్‌-బిట్రగుంట, సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, నర్సాపూర్‌-నాగర్సోల్‌, సికింద్రాబాద్‌-విజయవాడ, విజయవాడ-సికింద్రాబాద్‌, హైదరాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌ ట్రెయిన్లను రద్దు చేసినట్లు వెల్లడించింది.


ఈ నెల 8న నడిచే విశాఖపట్నం-తిరుపతి, రేణిగుంట-కాకినాడ టౌన్‌, లింగంపల్లి-విజయవాడ, తిరుపతి-కరీంనగర్‌, గూడూరు-విజయవాడ, సికింద్రాబాద్‌-విశాఖపట్నం, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌, నాగర్సోల్‌-నర్సాపూర్‌ ట్రెయిన్లు రద్దయ్యాయని తెలిపింది. ఈ నెల 9న నడిచే కాకినాడ టౌన్‌-లింగంపల్లి, కరీంనగర్‌-తిరుపతి, జమ్ముతావి-నాందెడ్‌, విశాఖపట్నం-సికింద్రాబాద్‌, ఈ నెల 10న నడిచే లింగంపల్లి-కాకినాడ టౌన్‌ రైళ్లను రద్దు చేసినట్టు పేర్కొంది.

Updated Date - 2021-05-07T09:50:44+05:30 IST