కెనడాలో ఘనంగా ఉగాది తెలుగు సాహిత్య సభ

ABN , First Publish Date - 2021-04-05T18:40:13+05:30 IST

తెలుగుతల్లి కెనడా, టొరాంటో తెలుగు టైమ్స్ సంయుక్తంగా శనివారం నిర్వహించిన ఉగాది సాహిత్య సభ అత్యంత వైభవంగా తొమ్మిది గంటలపాటు సాగింది. 40 మందికిపైగా కళాకారులు ఈ కార్యక్రమంలో

కెనడాలో ఘనంగా ఉగాది తెలుగు సాహిత్య సభ

టొరెంటో: తెలుగుతల్లి కెనడా, టొరాంటో తెలుగు టైమ్స్ సంయుక్తంగా శనివారం నిర్వహించిన ఉగాది సాహిత్య సభ అత్యంత వైభవంగా తొమ్మిది గంటలపాటు సాగింది. 40 మందికిపైగా కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జానపద గేయగానం, సాహిత్య ప్రసంగాలు, కవి సంగమం, కథా సమయం, సరదా క్విజ్ వంటి అనేక వైవిధ్యం ఉన్న సభలతో కళకళలాడిండి. సీనియర్ సాహితీ నిధులని, సంగీత విద్వాంసులని, సీనియర్ రచయితలని, సీనియర్ కవులని యువతకి పరిచయం చేసే లక్ష్యం నెరవేరిందని తెలుగుతల్లి ఎడిటర్ శ్రీమతి లక్ష్మి రాయవరపు ఈ సందర్భంగా తెలియజేశారు.




కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించిన వారికి కృతజ్ఞతలు చెప్పారు. యువతలో ఉన్న ప్రతిభని చూపేందుకు ఈ కార్యక్రమం అద్దంలా పనిచేసిందని టొరాంటో తెలుగు టైమ్స్ ఎడిటర్ శ్రీ సర్దార్ ఖాన్ అన్నారు. పెద్దలని ప్రేరణగా తీసుకుని అనేక కవితలు, కథలను రాయాలనుందని కార్యక్రమంలో పాల్గొన్న యువతీయువకులు అభిప్రాయపడ్డారు. ఆట పాటలతో తొమ్మిది గంటల సభ అలుపెరగక సాగిందని కార్యక్రమంలో పాల్గొన్న వీక్షకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం చరిత్ర సృష్టించిందని పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. కాగా.. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్న ప్రతీక పై మా కెనడా తెలుగు తల్లిని నెలకొల్పిన విషయం తెలిసిందే. కెనడాలో సరోజ కొమరవోలు 1985లో తెలుగుతల్లి పత్రిక విత్తనం నాటారు. లక్ష్మి రాయవరపు వారి టీం నిరంతర కృషితో వట వృక్షంగా ఎదిగి కెనడా వాసులకు సాహిత్యం లో కొంగు బంగారమైంది.  



Updated Date - 2021-04-05T18:40:13+05:30 IST