4ఏళ్ల తర్వాత స్వదేశానికి వచ్చిన యువకుడు.. ఫ్రెండ్స్తో కలిసి సరదాగా అమృత్సర్కు పయనం.. ఇంతలో..
ABN , First Publish Date - 2022-04-25T16:05:50+05:30 IST
ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి నాలుగేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన యువకుడు హత్యకు గురయ్యాడు. ఫ్రెండ్స్తో కలిసి అర్ధరాత్రి వేళ అమృత్సర్ వెళ్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘట
ఎన్నారై డెస్క్: ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి నాలుగేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన యువకుడు హత్యకు గురయ్యాడు. ఫ్రెండ్స్తో కలిసి అర్ధరాత్రి వేళ అమృత్సర్ వెళ్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
పంజాబ్లోని సుహావా గ్రామానికి చెందిన జతీందర్పాల్ సింగ్ ఉన్నత చదువుల కోసం నాలుగేళ్ల క్రితం కెనడా వెళ్లాడు. అనంతరం శాశ్విత నివాస హోదా పొందారు. ఈ క్రమంలో ఏప్రిల్ 16న స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఫ్రెండ్స్తో కలిసి శనివారం సాయంత్రం బయటికి వెళ్లాడు. స్నేహితులతో రెస్టారెంట్లో అర్ధరాత్రి 11.30గంటలకు భోజనం చేసి, తర్వాత కారులో అమృత్సర్కు పయనమయ్యాడు. ఈ నేపథ్యంలో బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో జతీందర్పాల్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరపింది ఎవరు? ఎందుకోసం అలా చేశారు? అనే విషయాలపై విచారణ జరుపుతున్నారు. దుండగులను గుర్తించేందుకు ఘటనా స్థలంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు.