బుక్ చేసిన నాలుగేళ్ళ తర్వాత కానీ ఈ కారు... చేతికందదు...

ABN , First Publish Date - 2022-01-23T20:59:54+05:30 IST

టొయోటా నుండి వస్తున్న ప్రీమియం కారు ల్యాండ్ క్రూయిజర్ ఎల్సీ 300 కారు... బుక్ చేసిన నాలుగేళ్ల తర్వాత కానీ చేతికందదు.

బుక్ చేసిన నాలుగేళ్ళ తర్వాత కానీ ఈ కారు... చేతికందదు...

హైదరాబాద్ : టొయోటా నుండి వస్తున్న ప్రీమియం కారు ల్యాండ్ క్రూయిజర్ ఎల్సీ 300 కారు... బుక్ చేసిన నాలుగేళ్ల తర్వాత కానీ చేతికందదు. ఇందుకు కారణం... సెమీ కండక్టర్ల కొరత. అని కంపెనీ చెబుతోంది. ఈ ఆలస్యానికి క్షమాపణలు కూడా చెబుతోంది. టొయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్సీ300 మోడల్ గతేడాది ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసైిందే. బుక్ చేసుకున్న వారు ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి. సెమీ కండక్టర్ల కొరత కారణంగా నాలుగేళ్ల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఈ వ్యవధిని సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నాలు చేస్తామని పేర్కొంది. ఇతర మార్కెట్లలో కూడా ఎల్సీ 300 విడుదల ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.


భారత్‌లో 2022 మూడో త్రైమాసికంలో విడుదలయ్యే అవకాశముందని చెబుతున్నప్పటికీ... 2023 చివరి నాటికి గానీ ఇది అందుబాటులోకి రాకపోవచ్చన్న అభిప్రాయాలు కూడా కంపెనీ వర్గాల నుంచే వినవస్తున్నాయి. ఇక కారు వివరాల్లోకి వెళితే... అత్యాధినిక టెక్నాలజీతో, అధిక ఫీచర్లతో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా... దీని  తయారీకి సెమీ కండక్టర్లు పెద్దఎత్తున అవసరం. అయితే గత కొంతకాలంగా సెమీ కండక్టర్ల కొరత తలెత్తడంతో ఉత్పత్తిలో అవాంతరాలు వస్తున్నాయి. 

Updated Date - 2022-01-23T20:59:54+05:30 IST