కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 28న క్యాంపస్ నియామకాలు
ABN , First Publish Date - 2022-01-25T05:54:13+05:30 IST
కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 28న డాక్టర్ రెడ్డీస్లో పనిచేసేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి క్యాంపస్ సెలక్షన్ నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు జిల్లా అధికారి షేక్ సలామ్ తెలిపారు.
కామారెడ్డి, జనవరి 24 : కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 28న డాక్టర్ రెడ్డీస్లో పనిచేసేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి క్యాంపస్ సెలక్షన్ నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు జిల్లా అధికారి షేక్ సలామ్ తెలిపారు. 2021లో ఇంటర్ ద్వితీయసంవత్సరంలో ఎంపీసీ, బీపీసీలలో 60శాతం పైగా మార్కులతో ఉత్తీర్ణులైన ఫ్రెషర్స్కు మాత్రమే అని తెలిపారు. 28 జనవరి2002నుంచి జనవరి 27 2004 మధ్య జన్మిం చిన వారు 18 నుంచి నించి 20 ఏళ్లలోపు విద్యార్థులు మాత్రమే అర్హులని తెలిపారు. కంపెనీ ప్రతినిధులు వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహిస్తానరని, ఎంపికైన వారికి సంవత్సరానికి రూ.1.60లక్షల జీతంతో పాటు ఉన్నత చదువుకు కావాల్సిన ఏర్పాటు ఉంటాయని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యా ర్థులు ఈనె 28న ఎస్సెస్సీ, ఇంటర్ పాస్ మార్క్సు మెమోతో పాటు, రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలు, ఐడీ ఫ్రూఫ్, అడ్రస్ ప్రూఫ్లు తీసుకొని రావా లని సూచించారు. ఇతర వివరాలకు 8074963700, 9866143782 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.