జర్నలిస్టు కుటుంబానికి రూ.50 లక్షలు బీమా చెల్లించాలి
ABN , First Publish Date - 2020-07-14T19:39:05+05:30 IST
తిరుపతిలో కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన ఓ న్యూస్ ఛానెల్ కెమెరామెన్ ..
కడప: తిరుపతిలో కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన ఓ న్యూస్ ఛానెల్ కెమెరామెన్ పార్థసారధికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రూ.50 లక్షల బీమా వర్తింపజేయాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ప్రెస్క్లబ్లో పార్థసారధి మృతికి సంతాపంగా సమావేశం నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి మాట్లాడుతూ బయటకు కనబడని కరోనాపై మీడియా సోదరులు సైనికుల్లా పోరాటం చేస్తున్నారని, ఇందులో జర్నలిస్టు మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ప్రకారంగా రూ.50 లక్షల బీమా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే సంస్థ తాలుకు యాజమాన్యం కూడా మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రామాంజులరెడ్డి, క్రిష్ణప్రసాద్రెడ్డి, సుబ్బరామయ్య, నాగరాజు, శ్రీకాంత్తో పాటుగా పలువురు ఫొటోగ్రాఫర్లు, పాత్రికేయులు, కెమెరామెన్లు పాల్గొన్నారు.