ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-11-30T06:20:08+05:30 IST
ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
ఉయ్యూరు, నవంబరు 29 : కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటంతో పాటు ఇమ్యూనిటీ పెంచుకోవటం మన ముందున్న కర్తవ్య మని కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. ఉయ్యూరు నగర పంచాయతీ పారిశుధ్య కార్మికులు, సచివాలయ ఉద్యోగులకు నగర పంచాయతీ కమిషనర్ ఎన్.ప్రకాష్ రావు ఆధ్వర్యంలో ఎన్జీవో సంస్థకు చెందిన జేమ్స్ సహకారంతో ఆయుర్వేద మాత్రలు, మాస్క్లు, శానిటైజర్లు, మెడికల్ కిట్లు ఆదివారం అందజేశారు. జంపా న కొండలరావు, ఎంపీడీవో సునీతాశర్మ, తహసీల్దార్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.