ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2021-03-01T05:11:57+05:30 IST

జిల్లాలో ఎన్టీఎస్‌ఈ, ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి.

ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలు

గుజరాతీపేట, ఫిబ్రవరి 28: జిల్లాలో ఎన్టీఎస్‌ఈ,  ఎన్‌ఎంఎంఎస్‌  పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఎన్‌ఎంఎంఎస్‌కు 4,040 మందికిగాను 3,939 మంది విద్యార్థులు హాజరు కాగా, 107 మంది గైర్హాజరయ్యారని డీఈవో చంద్రకళ తెలిపారు. అలాగే ఎన్టీఎస్‌ఈకు 1,994 మందికిగాను 1,840 మంది విద్యార్థులు హాజరు కాగా, 154 మంది గైర్హాజరయ్యారని చెప్పారు. ఎన్‌ఎంఎంఎస్‌ కు సంబంధించి జిల్లాలో మొత్తం 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క శ్రీకాకుళంలో మొత్తం 8, టెక్కలి, పాలకొండలలో 6 కేంద్రాల చొప్పున ఏర్పాటు చేశారు. కాగా ఎన్టీఎస్‌ఈకి సంబంధించి 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. శ్రీకాకుళంలోని పరీక్షా కేంద్రాలను డీఈవో పరిశీలించారు. 

 


Updated Date - 2021-03-01T05:11:57+05:30 IST