మన్యంలో ప్రశాంతంగా కొవిడ్‌ కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-05-06T04:24:40+05:30 IST

కొవిడ్‌ను అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ తొలిరోజు బుధవారం మన్యంలో ప్రశాంతంగా జరిగింది. 12 గంటల తర్వాత జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో పాడేరులోని రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి.

మన్యంలో ప్రశాంతంగా కొవిడ్‌ కర్ఫ్యూ
ఖాళీగా పాడేరు- విశాఖ మెయిన్‌రోడ్డు

ఇళ్లకే పరిమితమైన జనం.... అంతటా నిర్మానుష్యం

పాడేరు, మే 5: కొవిడ్‌ను అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ తొలిరోజు బుధవారం మన్యంలో ప్రశాంతంగా జరిగింది.  12 గంటల తర్వాత జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో పాడేరులోని రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు జీపులు, ఆటోలు, సొంత వాహనాలు నిలుపుదల చేశారు. హోటళ్లు, దుకాణాలు, బ్యాంకులు 12 గంటలకు మూసివేశారు. సీఐ పీపీ నాయుడు, ఎస్‌ఐ శ్రీనివాస్‌ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఏజెన్సీలో అన్ని మండలాల్లోనూ కర్ఫ్యూ ప్రశాంతంగా కొనసాగుతున్నది.

Updated Date - 2021-05-06T04:24:40+05:30 IST