మోదీ తల్లిని కించపరిచిన కాలర్.. క్షమాపణ చెప్పిన హోస్ట్!

ABN , First Publish Date - 2021-03-04T05:58:47+05:30 IST

ప్రఖ్యాత బీబీసీ రేడియోలో మాట్లాడుతూ భారత ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ను అవమానించాడో కాలర్. ఈ ఘటన బీబీసీ ఏసియా నెట్వర్క్ రేడియో షోలో జరిగింది. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపింది.

మోదీ తల్లిని కించపరిచిన కాలర్.. క్షమాపణ చెప్పిన హోస్ట్!

న్యూఢిల్లీ: ప్రఖ్యాత బీబీసీ రేడియోలో మాట్లాడుతూ భారత ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ను అవమానించాడో కాలర్. ఈ ఘటన బీబీసీ ఏసియా నెట్వర్క్ రేడియో షోలో జరిగింది. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆడియో టేపులు ట్విట్టర్లో ప్రత్యక్షం అవ్వడంతో ఇది మరింత వైరల్ అయింది. నెటిజన్లు అందరూ ఈ కార్యక్రమ నిర్వాహకులను కూడా తిట్టిపోశారు. దీనిపై స్పందించిన షో హోస్ట్ ప్రియా రాయ్ క్షమాపణలు చెప్పారు. ‘‘అక్కడ అలాంటి భాష వాడాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో నేను క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నా’’ అని ఆమె ట్వీట్ చేశారు. అయితే సదరు కాలర్‌ మాటలపై మాత్రం నెటిజన్లు మండిపడుతున్నారు.

Updated Date - 2021-03-04T05:58:47+05:30 IST