బిష్ణోయ్కు పిలుపు
ABN , First Publish Date - 2022-01-27T06:45:51+05:30 IST
టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కల నెరవేరింది. స్వదేశంలో
కుల్దీప్ రీఎంట్రీ అశ్విన్పై వేటు..
షమి, బుమ్రాకు విశ్రాంతి
వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్కు టీమిండియా
న్యూఢిల్లీ: టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కల నెరవేరింది. స్వదేశంలో వెస్టిండీస్తో జరిగే వన్డే, టీ20 సిరీ్సలకు బుధవారం ప్రకటించిన భారత జట్టులో రాజస్థాన్కు చెందిన బిష్ణోయ్కు చోటుదక్కింది. కాగా, మోకాలి సర్జరీ తర్వాత కోలుకున్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా వైట్బాల్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్గా ఉండడంతో జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. వచ్చే నెల 6 నుంచి జరిగే వన్డే సిరీ్సతో విండీస్ పర్యటన ఆరంభం కానుంది. బరోడా ఆటగాడు దీపక్ హుడాకు వన్డే జట్టులో స్థానం లభించింది. అయితే, స్పిన్నర్ అశ్విన్పై వేటుపడగా.. కరోనా కారణంగా సౌతాఫ్రికా టూర్కు దూరమైన వాషింగ్టన్ సుందర్ మళ్లీ టీమ్లోకి వచ్చాడు. కాగా, పేసర్లు బుమ్రా, షమిలకు విశ్రాంతినిచ్చినట్టు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో తెలిపారు. వ్యక్తిగత కారణాలతో కేఎల్ రాహుల్ తొలి వన్డేకు దూరం కానున్నట్టు చెప్పారు. జడేజా పూర్తిగా కోలుకోలేదని.. కానీ, అక్షర్ పటేల్ టీ20లకు అందుబాటులో ఉంటాడని షా పేర్కొన్నారు. పేసర్ భువనేశ్వర్ కుమార్ వన్డే జట్టులో చోటు కోల్పోయినా.. టీ20లకు ఎంపికయ్యాడు. స్వదేశంలో న్యూజిలాండ్ టూర్కు ఎంపికైన అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్ మళ్లీ టీమ్లోకి వచ్చారు. కాగా, హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయగలిగే స్థాయిలో ఫిట్నెస్ లేదని సెలెక్టర్లు భావించినట్లు తెలిసింది. అంతేకాదు.. దేశవాళీ క్రికెట్లో బౌలింగ్ చేసి ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిందిగా హార్దిక్కు సూచించినట్లు సమాచారం.
వన్డే జట్టు
రోహిత్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్కెప్టెన్), రుతురాజ్, ధవన్, కోహ్లీ, సూర్యకుమార్, శ్రేయాస్, దీపక్ హూడా, పంత్, చాహర్, శార్దూల్, చాహల్, కుల్దీప్, సుందర్, బిష్ణోయ్, సిరాజ్, ప్రసిధ్, అవేశ్ఖాన్
టీ 20 జట్టు
రోహిత్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్కెప్టెన్), ఇషాన్, కోహ్లీ, శ్రేయాస్, సూర్యకుమార్, పంత్, వెంకటేశ్, చాహర్, శార్దూల్, బిష్ణోయ్, అక్షర్, చాహల్, సుందర్, సిరాజ్, భువనేశ్వర్, అవేశ్, హర్షల్