కాల్ అవే గోల్ఫ్ సంస్థ తెలంగాణను ఎంచుకోవడం సంతోషంగా ఉంది: కేటీఆర్
ABN , First Publish Date - 2022-05-12T18:21:50+05:30 IST
హైదరాబాద్లో అమెరికాకు చెందిన కాల్అవే గోల్ఫ్ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. హైదరాబాద్లో రూ.150 కోట్లతో అతిపెద్ద డిజిటెక్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది
హైదరాబాద్ : హైదరాబాద్లో అమెరికాకు చెందిన కాల్అవే గోల్ఫ్ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. హైదరాబాద్లో రూ.150 కోట్లతో అతిపెద్ద డిజిటెక్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. రాయదుర్గం నాలెడ్జ్ సెంటర్లో కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాల్ అవే గోల్ఫ్ సంస్థ రెండో కార్యాలయం కోసం.. తెలంగాణను ఎంచుకోవడం చాలా సంతోషమన్నారు. మౌళిక సదుపాయాల్లో దేశంలోని అన్ని నగరాల కంటే.. హైదరాబాద్ ముందుందని కేటీఆర్ పేర్కొన్నారు.