ధరణిపై కొనసాగుతున్న కేబినెట్ సబ్ కమిటీ భేటీ
ABN , First Publish Date - 2021-11-11T00:26:58+05:30 IST
ధరణిపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కొనసాగుతోంది. మంత్రి హరీష్రావు అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.
హైదరాబాద్: ధరణిపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కొనసాగుతోంది. మంత్రి హరీష్రావు అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. 40 అంశాలతో పరిష్కార మార్గాలను సబ్ కమిటీ సిద్ధం చేసింది. ఇప్పటికే 18 రకాల సమస్యలను ప్రభుత్వం గుర్తించింది. అన్నింటికీ కోర్ట్కు వెళ్ళకుండా కలెక్టర్లకు బాధ్యతలు కట్టబెట్టేలా ప్రతిపాదనలు తీసినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్కు క్యాబినెట్ సబ్ కమిటీ తుది నివేదిక ఇవ్వనుంది. క్యాబినెట్ సబ్ కమిటీ నివేదికను సీఎం పరిశీలించనున్నారు. సీఎం ఆమోదం తర్వాత కలెక్టర్లకు సీఎస్ మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.