CAB డ్రైవర్లకు తాలిబన్ల హెచ్చరిక
ABN , First Publish Date - 2021-11-08T01:23:48+05:30 IST
తూర్పు నంగర్హార్ ప్రావిన్స్లోని ట్యాక్సీ డ్రైవర్లకు తాలిబన్లు సరికొత్త ఆదేశాలు జారీ చేశారు.
కాబూల్: తూర్పు నంగర్హార్ ప్రావిన్స్లోని ట్యాక్సీ డ్రైవర్లకు తాలిబన్లు సరికొత్త ఆదేశాలు జారీ చేశారు. తాలిబన్ అనుబంధ సంస్థలకు చెందిన సాయుధులను తప్ప మిగతా ఎవరినీ తమ వాహనాల్లో ఎక్కించుకోవద్దని ఆదేశించారు. ఈ మేరకు నంగర్హార్ ప్రావిన్షియల్ కార్యాలయం పేర్కొంది.
ప్రావిన్స్ రక్షణ కోసం నలుమూలలా ఉన్న డ్రైవర్లు ఈ విషయంలో తమతో చేతులు కలపాలని కోరింది. సాయుధులైన ఇతరులను రవాణా చేయకుండా అడ్డుకోవాలని సూచించింది. టాక్సీలలో ఎవరైనా అనుమానిత సాయుధుడు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పేర్కొంది.
దేశంలోని తూర్పు ప్రావిన్స్లో ఐసిస్-కె ఉగ్రవాదులు చెలరేగిపోతూ ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఈ సందర్భంగా ఏ సంస్థ పేరును ప్రభుత్వం ప్రస్తావించలేదు.