448 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-10-31T08:24:41+05:30 IST
జిల్లాలో శుక్రవారం కొత్తగా 448 మందికి కరోనా వైరస్ సోకింది. గడచిన 24 గంటల్లో మరో ముగ్గురు బాధితులు మృత్యువాత పడ్డారు.
మరో ముగ్గురు మృతి ఫ 414 మంది డిశ్చార్జి
ఆంధ్రజ్యోతి, విజయవాడ : జిల్లాలో శుక్రవారం కొత్తగా 448 మందికి కరోనా వైరస్ సోకింది. గడచిన 24 గంటల్లో మరో ముగ్గురు బాధితులు మృత్యువాత పడ్డారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 38,899కి చేరుకున్నాయి. కరోనా మరణాలు అధికారికంగా 563కు పెరిగాయి. మొత్తం పాజిటివ్ బాధితుల్లో ఇప్పటి వరకు 35,088 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 414 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకోగా.. ఇంకా 3,248 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండటంతో ఇటు ప్రజల్లోను, అటు అధికారుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది.