పార్లమెంట్‌ సబార్డినేట్‌ కమిటీ చైర్మన్‌గా

ABN , First Publish Date - 2020-10-30T09:44:44+05:30 IST

పార్లమెంటు సబార్డినేట్‌ లెజిస్లేచర్‌ కమిటీ చైర్మన్‌గా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి న్యూఢిల్లీలో గురువారం బాధ్యతలు చేపట్టారు.

పార్లమెంట్‌ సబార్డినేట్‌ కమిటీ చైర్మన్‌గా

ఎంపీ బాలశౌరి బాధ్యతల స్వీకరణ


మచిలీపట్నం : పార్లమెంటు సబార్డినేట్‌ లెజిస్లేచర్‌ కమిటీ చైర్మన్‌గా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి న్యూఢిల్లీలో గురువారం బాధ్యతలు చేపట్టారు. పార్లమెంటులోని అనెక్స్‌ భవనంలో అధికారులు ఆర్‌సీ తివారి, రంగరాజన్‌ ఎంపీ బాలశౌరికి స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో భేటీ అయ్యారు. అధికారులు కమిటీ పనితీరును వివరించారు. ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న ఫైళ్లు, ఇతరత్రా సమస్యలను ఎంపీ అడిగి తెలుసుకున్నారు. త్వరలోని కమిటీ సభ్యులతో సమావేశానికి ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. 

Updated Date - 2020-10-30T09:44:44+05:30 IST