వర్క్ చార్జెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఇదే..
ABN , First Publish Date - 2020-09-28T10:59:30+05:30 IST
ఏపీ వర్క్ చార్జెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. గాంధీనగర్లోని ఎన్జీవో హోమ్లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.
వన్టౌన్, సెప్టెంబరు 27 : ఏపీ వర్క్ చార్జెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. గాంధీనగర్లోని ఎన్జీవో హోమ్లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సీహెచ్ పోతురాజు, సహ అధ్యక్షుడిగా ఎం.పాణిగ్రాహి, వర్కింగ్ ప్రెసిడెంట్గా డి.సత్యవతి, ప్రధాన కార్యదర్శిగా ఎస్.
అశోక్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నూతన కార్యవర్గం మూడేళ్ల పాటు కొనసాగుతుందని విద్యాసాగర్ తెలిపారు. నూతన అధ్యక్షుడు పోతురాజు, మరికొందరు మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద తమ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, త్వరగా పరిష్కరించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి అన్ని సంఘాల ఉద్యోగులు జేఏఏసీ కింద పోరాటం చేస్తామని హెచ్చరించారు.