Political War: టీడీపీ నేతలకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సవాల్
ABN , First Publish Date - 2022-09-28T03:54:50+05:30 IST
టీడీపీ (Tdp) నేతలకు వైసీపీ (Ycp) రాష్ట్ర యువ విభాగం అధ్యక్షుడు, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి (ByReddy Siddharth Reddy) సవాల్ విసిరారు. నందికొట్కూరు అమ్మవారిశాలలోని...
నంద్యాల (Nandyala): టీడీపీ (Tdp) నేతలకు వైసీపీ (Ycp) రాష్ట్ర యువ విభాగం అధ్యక్షుడు, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి (ByReddy Siddharth Reddy) సవాల్ విసిరారు. నందికొట్కూరు అమ్మవారిశాలలోని వాసవీమాతను దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని దీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. జగన్ అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్లు రాజకీయాలు వదిలేస్తారా ప్రశ్నించారు. టీడీపీ నాయకులు ఇక నుంచైనా డబ్బా మాటలు మానుకోవాలని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హితవు పలికారు.