విద్యార్థి యువజన సంఘాల బైక్ ర్యాలీ
ABN , First Publish Date - 2021-03-04T06:37:01+05:30 IST
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం శుక్రవారం తలపెట్టిన రాష్ట్రబంద్ను జయప్రదం చేయాలని ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
రేపటి బంద్ను జయప్రదం చేయాలని వినతి
గుంటూరు (తూర్పు), మార్చి3: విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం శుక్రవారం తలపెట్టిన రాష్ట్రబంద్ను జయప్రదం చేయాలని ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బంద్కు మద్దతుగా బుధవారం విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో స్థానిక లాడ్జి సెంటర్ నుంచి బీఆర్ స్టేడియం వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉక్కు అమ్మకంతో దేశాభివృద్ధికి తీవ్రనష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా బీజేపీ రాష్ట్ర నాయకులు తమ ముసుగులు తొలగించి ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వై.నేతాజీ, వెలుగూరి రాధాకృష్ణమూర్తి, గనిరాజు, కె.శ్రీనివాసరావు, బి.ముత్యాలరావు, పాశం రామారావు, నళినీకాంత్, అంజిబాబు, అరుణ్కుమార్, మనోజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.