బైక్ను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం
ABN , First Publish Date - 2021-09-17T05:23:34+05:30 IST
మరో 20 నిమిషాలు గడిస్తే.. ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులతో భోజనం చేయాల్సిన వారి బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే ఒక రు మృతి చెందగా.. మరొకరు గాయపడిన
ఒకరి మృతి
మరొకరికి గాయాలు
బుచ్చిరెడ్డిపాళెం, సెప్టెంబరు 16: మరో 20 నిమిషాలు గడిస్తే.. ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులతో భోజనం చేయాల్సిన వారి బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే ఒక రు మృతి చెందగా.. మరొకరు గాయపడిన ఘటన మండలంలోని దామరమడుగు, (మఠం కాలనీ) ఆర్ఆర్నగర్లోని జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బాలాజీనగర్ మసీదు సెంటర్కు చెందిన సాయికుమార్, హుస్సేన్ వీరిద్దరు ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నారు. గురువారం ఈ యువకులు బైక్పై సంగం మండలంలో ఏసీ మరమ్మతు నిమిత్తం వెళ్లి, తిరిగి నెల్లూరు వస్తుండగా.. బుచ్చి మండలం దామరమడుగు సమీపంలోకి వచ్చేసరికి గుర్తు తెలియని వాహనం వీరి బైక్ను ఢీకొన డంతో సాయికుమార్ (23) అక్కడికక్కడే మృతి చెందగా.. హుస్సేన్ గా యపడ్డాడు. క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం 108లో బుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యసేవలందించారు. చేతికందివచ్చిన బిడ్డ తిరిగిరాని లోకానికి వెళ్లాడనే విషయం తెలియడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.