రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు: బీవీ రాఘవులు
ABN , First Publish Date - 2021-12-05T19:24:49+05:30 IST
రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు.
విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రత్యర్ధులు మధ్య విబేధాలు, పరిమితులు ఎలా ఉండాలో రోశయ్యను చూసి నేర్చుకోవాలన్నారు. విశాఖ ఉక్కును ముక్కలుగా చేసి అమ్మాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కిసాన్ పోరాట స్పూర్తితో ఉక్కు ఉద్యోగులు పోరాడాలని సూచించారు. వ్యవసాయ నల్లచట్టాల ఉపసంహరణే కాదు... కనీస మద్దతు ధరను చట్టబద్దం చేయాలన్నారు. లేదంటే ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి శృంగభంగం తప్పదని రాఘవులు వ్యాఖ్యానించారు.