రైతు బజార్లలోనే కూరగాయలు కొనుగోలు చేయండి
ABN , First Publish Date - 2020-03-31T11:34:13+05:30 IST
నగరంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఏడు రైతు బజార్లలోనే కూరగాయలు కొనుగోలు చేయాలని నగరపాలక సంస్థ
నగర కమిషనర్ రవీంద్ర
అనంతపురం కార్పొరేషన్, మార్చి30: నగరంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఏడు రైతు బజార్లలోనే కూరగాయలు కొనుగోలు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్ర కోరారు. పాతవూరు తాడిపత్రి బ స్టాండులోని మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పలు ఫిర్యాదులు అందాయన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో రైతు బజార్లు ఏర్పాటుచేశామన్నారు. ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే అమ్మకాలు జరుగుతాయన్నారు. ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా భౌతిక దూరం పాటించాలని సూచించారు.