బంపరాఫర్.. Box.. పట్టినన్ని పుస్తకాలు తీసుకెళ్లండి!
ABN , First Publish Date - 2022-05-21T18:52:12+05:30 IST
బంపరాఫర్.. Box.. పట్టినన్ని పుస్తకాలు తీసుకెళ్లండి!
- 26 నుంచి పుస్తక ప్రదర్శన
హైదరాబాద్సిటీ : బుక్ చోర్ అనే సంస్థ ఈనెల 26 నుంచి 29 వరకు శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమం వద్ద పుస్తక ప్రదర్శన నిర్వహిస్తోంది. ఇందులో 10 లక్షలకు పైగా పుస్తకాలు (Books) ఏర్పాటు చేయనుంది. సందర్శకులు కొనుగోలు చేసిన ప్రతి పుస్తకానికీ ధర చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రవేశం వద్ద ఉన్న బాక్స్లలో మీరు తీసుకోవాలనుకున్న దానికి మాత్రమే ధర చెల్లిసే.. ఆ బాక్స్లో (Box) పట్టినన్ని పుస్తకాలను తీసుకెళ్లొచ్చు. ఈ బాక్స్లు మూడు రకాలు. ఒడిస్సీ(రూ. 1,199), పెర్సియస్ (1,799), హెర్క్యులస్(2,999).