ముగిసిన రాజస్థాన్ ఇన్నింగ్స్.. ముంబై ఎదుట ఓ మోస్తరు లక్ష్యం
ABN , First Publish Date - 2022-05-01T03:04:24+05:30 IST
ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసింది
ముంబై: ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసిన రాజస్థాన్.. ముంబై ఎదుట ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబైని అడ్డుకోవాలంటే రాజస్థాన్ బౌలర్లు బంతికి పదును పెట్టాల్సి ఉంటుంది.
ఓపెనర్ జోస్ బట్లర్ అర్ధ సెంచరీ (52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 67) రాణించాడు. అతడు తప్ప జట్టులో ఎవరూ క్రీజులో కుదురుకోలేకపోయారు. పడిక్కల్ 15, కెప్టెన్ శాంసన్ 16, డరిల్ మిచెల్ 17, హెట్మెయిర్ 6, రియాన్ పరాగ్ 3 పరుగులు చేశారు.
చివర్లో రవిచంద్రన్ అశ్విన్ మెరుపులు మెరిపించాడు. 9 బంతుల్లో మూడు ఫోర్లు, సిక్సర్తో 21 పరుగులు చేయడంతో రాజస్థాన్ 150 పరుగుల మార్క్ను దాటింది. ముంబై బౌలర్లలో హృతిక్ షాకీన్, మెరెడిత్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, డేనియల్ శామ్స్, కుమార్ కార్తికేయ చెరో వికెట్ తీసుకున్నారు.