చేతకాని సీఎం వల్లే ఏపీ అంధకారం: గోరంట్ల
ABN , First Publish Date - 2022-04-08T21:50:58+05:30 IST
చేతకాని సీఎం వల్లే ఏపీ అంధకారంలో ఉందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు.
అమరావతి: చేతకాని సీఎం వల్లే ఏపీ అంధకారంలో ఉందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.16 వేల కోట్ల భారం వేశారని మండిపడ్డారు. కరెంట్ కోతలతో రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాకుండా పారిపోతున్నారన్నారు. ధరల నియంత్రణ లేదు.. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించలేదని చెప్పారు. కొత్తవారికి దోచుకునేందుకే సీఎం జగన్మోహన్రెడ్డి మంత్రివర్గ కూర్పు చేశారని ధ్వజమెత్తారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి రూ.2 వేల నోట్లను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్నారు. కనీస వసతులు ఏర్పాటు చేయకుండానే జిల్లాలను విభజించారని గోరంట్ల బుచ్చయ్యచౌదరి దుయ్యబట్టారు.