జగన్ చెప్పేదొకటి.... చేసేదొకటి : బుచ్చయ్యజగన్ చెప్పేదొకటి.... చేసేదొకటి : బుచ్చయ్యచౌదరిచౌదరి
ABN , First Publish Date - 2021-12-03T19:13:19+05:30 IST
సీఎం జగన్ చెప్పేదొకటి.... చేసేదొకటని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలయ్యిందన్నారు.
అమరావతి : సీఎం జగన్ చెప్పేదొకటి.... చేసేదొకటని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలయ్యిందన్నారు. రాష్ట్రం చిన్నాభిన్నం అయ్యిందని పేర్కొన్నారు. OTS ప్రోగ్రాంను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ.. ‘‘పెన్షన్, రేషన్ కట్ చేస్తాం అంటే ఎలా? OTS కోసం ఒత్తిడి తెస్తున్నారని నేను నిరూపిస్తా. బొత్స రాజీనామా చేస్తారా!? 4,800 కోట్లు OTS ద్వారా ఎందుకు ప్రజల నుంచి తీసుకోవాలి అనుకుంటున్నారు. రాష్ట్రాన్ని ఆదాని లాంటి వారికి తాకట్టు పెడుతున్నారు. సీఎం బటన్ నొక్కినా అకౌంట్లలో డబ్బులు పడడం లేదు. గౌరవ సభలు ఒక్క ఇష్యూ పైనే కాదు... అన్ని సమస్యలపై జరగాలి. చట్టసభల్లో జరిగిన ఘటనకు సీఎం జగన్ స్వయంగా అక్కడే క్షమాపణ చెప్పాలి’’ అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.