TDP తిరిగి అధికారంలోకి రావడానికి ప్రవాసుల సహకారం అవసరం: బుచ్చయ్య చౌదరి

ABN , First Publish Date - 2022-05-21T23:00:23+05:30 IST

అమెరికాలోని బోస్టన్ నగరంలో రెండు రోజుల పాటు జరిగే తెలుగుదేశం మహానాడు కార్యక్రమం శుక్రవారం రాత్రి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య

TDP తిరిగి అధికారంలోకి రావడానికి ప్రవాసుల సహకారం అవసరం: బుచ్చయ్య చౌదరి

బోస్టన్‌లో వైభవంగా మహానాడు ప్రారంభం

ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి కిలారు ముద్దుకృష్ణ: అమెరికాలోని బోస్టన్ నగరంలో రెండు రోజుల పాటు జరిగే తెలుగుదేశం మహానాడు కార్యక్రమం శుక్రవారం రాత్రి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావటం కోసం ప్రవాస తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్రంగా కృషి చేయాలన్నారు. ప్రవాసుల సహకారం ఎంతో అవసరం అని పేర్కొన్నారు. ఎన్నారైల సహకారంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తపరిచారు.


ఎన్నికల సమయంలో ప్రవాసాంధ్రులు తమ  ప్రాంతాలకు వచ్చి తెలుగుదేశం తిరిగి అధికారంలోకి రావడం కోసం కృషి చేయాలని బుచ్చయ్యచౌదరి పిలుపు ఇచ్చారు. పార్టీ సీనియర్ నేతలు ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.ఎన్. ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, వై.వి.ప్రభాకర చౌదరి, పార్టీ నేతలు గౌతు శిరీష, నన్నారి నర్సిరెడ్డి, మన్నవ సుబ్బారావు తదితరులు ప్రసంగించారు. ఎన్నారై టీడీపీ కన్వీనర్ కోమటి జయరాం స్వాగతం పలికారు. అమెరికా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో టీడీపీ అభిమానులు కార్యకర్తలు ఈ మహానాడుకు తరలి వచ్చారు.




Updated Date - 2022-05-21T23:00:23+05:30 IST