నిజామాబాద్ జిల్లా బుస్సపూర్లో భారీ మొసలి కలకలం
ABN , First Publish Date - 2022-05-25T03:00:01+05:30 IST
మెండోరా మండలం బుస్సపూర్లో భారీ మొసలి కలకలం రేపింది. ఊరి చెరువులో జాలర్ల వలకు మొసలి చిక్కింది. పది రోజులుగా...
నిజామాబాద్: మెండోరా మండలం బుస్సపూర్లో భారీ మొసలి కలకలం రేపింది. ఊరి చెరువులో జాలర్ల వలకు చిక్కింది. పది రోజులుగా తమ ఊరి చెరువులో భారీ మొసళ్ళు కనబడుతున్నాయంటూ గ్రామ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో అటవీ అధికారులు చర్యలు చేపట్టారు. చెరువులో గాలించి మొసలిని పట్టుకున్నారు. బోనులో బంధించి తీసుకువెళ్లారు. దాంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.