వ్యాపారవేత్త సాహెబ్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2022-05-27T07:10:13+05:30 IST

వ్యాపారవేత్త బాలేరహంతు సాహెబ్‌ (80) గురువారం స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనా రోగ్యంతో బాధపడుతున్నారు.

వ్యాపారవేత్త సాహెబ్‌ కన్నుమూత
సాహెబ్‌ మృతదేహానికి నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు

పామూరు, మే 26 : వ్యాపారవేత్త బాలేరహంతు సాహెబ్‌ (80) గురువారం స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనా రోగ్యంతో బాధపడుతున్నారు. సాహెబ్‌కు భార్య, నలుగురు కుమారులు, ముగ్రుఉ కుమార్తెలు ఉన్నారు. 2001లో జరిగిన పామూరు గ్రామ పం చాయుతీ ఎన్నికల్లో  కాంగ్రెస్‌, వామపక్షాలు బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థిగా సాహెబ్‌ పోటీ చేసి ఓటమి చవిచూశారు.  ఉర్దూ పాఠశాల నిర్మాణానికి 5 సెంట్ల స్థలాన్ని ఆయన విరాళంగా ఇచ్చారు.  ఆయన మరణవార్త తెలిసిన వెంటనే పలు పార్టీల నాయకులు సాహెబ్‌ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.  టీడీపీ నాయకులు పువ్వాడి వెంకటేశ్వర్లు, బొల్ల్లా మాల్యాద్రి చౌదరి, మాజీ సర్పంచులు కావిటి సుబ్బయ్య, సయ్యద్‌దౌలత్‌, అమీర్‌బాబు, షేక్‌ ఖాజా రహంతుల్లా, షేక్‌గౌస్‌ బాషా, హరీష్‌, రఫి, ముబీనా మౌలాలి, ఇర్రికోటిరెడ్డి, జిలాని, షేక్‌ ఖాదర్‌ మొహిద్దీన్‌, సీపీఐ, సీపీఎం, వైసీపీ నాయకులు నివా ళులర్పించిన వారిలో ఉన్నారు. 


Updated Date - 2022-05-27T07:10:13+05:30 IST