నిర్మాణంలో ఉన్న ఇంట్లో నిద్రపోయిన 25 ఏళ్ల యువకుడు.. తెల్లారినా రాకపోవడంతో వెళ్లి చూస్తే షాకింగ్ సీన్.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2022-08-05T20:58:41+05:30 IST

అతను చెప్పులు తయారు చేసి విక్రయించే వ్యాపారి.. ప్రస్తుతం స్వంతంగా ఇల్లు కట్టుకుంటున్నాడు..

నిర్మాణంలో ఉన్న ఇంట్లో నిద్రపోయిన 25 ఏళ్ల యువకుడు.. తెల్లారినా రాకపోవడంతో వెళ్లి చూస్తే షాకింగ్ సీన్.. అసలు కథేంటంటే..

అతను చెప్పులు తయారు చేసి విక్రయించే వ్యాపారి.. ప్రస్తుతం స్వంతంగా ఇల్లు కట్టుకుంటున్నాడు.. గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత అతను నిర్మాణంలో ఉన్న ఇంటి దగ్గరకు వెళ్లి నిద్రపోయాడు.. ఉదయం ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లి చూశారు.. అక్కడ అతను రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్నాడు.. ఎవరో అతడిని గొంతు కోసి చేంపేశారు.. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Madhya Pradesh: తనపై కేసు పెట్టిన యువతిపై పగ.. బెయిల్‌పై బయటకు వచ్చిన ఆ వ్యక్తి ఏం చేశాడంటే..


ఆగ్రాకు సమీపంలోని రకాబ్‌గంజ్ ప్రాంతానికి చెందిన సికిందర్ (25) అనే వ్యక్తి చెప్పులు తయారు చేసే ఫ్యాక్టరీ నడపుతున్నాడు. తన గ్రామంలోనే కొత్తగా ఓ ఇల్లు కడుతున్నాడు. ప్రతిరోజు రాత్రి భోజనం చేసి నిర్మాణంలో ఉన్న ఇంటి దగ్గరకు వెళ్లి నిద్రపోయేవాడు. గురువారం రాత్రి కూడా అలాగే వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లి చూశారు. అక్కడ సకిందర్ రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్నాడు. ఎవరో అతడిని గొంతు కోసి చేంపేశారు. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 


సికిందర్ కొత్తగా నిర్మాణం చేపడుతున్న ఇంటి పక్కన బంటి అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతని భార్య సోనూతో సికిందర్ తరచుగా మాట్లాడుతూ ఉండేవాడు. దీంతో బంటీ అనుమానం పెంచుకున్నాడు. తన భార్యతో సికిందర్ అఫైర్ పెట్టుకున్నాడని భావించి అతడిపై కోపం పెంచుకున్నాడు. గురువారం రాత్రి అతడే సికిందర్‌ను చంపేసి ఉంటాడని కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న బంటి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Updated Date - 2022-08-05T20:58:41+05:30 IST