Dog కనిపించడం లేదంటూ ప్రముఖ వ్యాపారవేత్త ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-12-15T15:01:26+05:30 IST

ఇంట్లో పెంచుకుంటున్న శునకం కనిపించకుండా పోయిందని ఓ

Dog కనిపించడం లేదంటూ ప్రముఖ వ్యాపారవేత్త ఫిర్యాదు

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : ఇంట్లో పెంచుకుంటున్న శునకం కనిపించకుండా పోయిందని ఓ వ్యాపారి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షేక్‌పేట లక్ష్మీనగర్‌కాలనీకి చెందిన ప్రమోద్‌ కులకర్ణి వ్యాపారవేత్త. అతను డాల్మిటెన్‌ జాతికి చెందిన శునకాన్ని ఇంట్లో పెంచుకుంటున్నాడు. ఈనెల 13న శునకం బయటకు వచ్చింది. అప్పటినుంచి కనిపించకుండా పోయిందని కులకర్ణి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2021-12-15T15:01:26+05:30 IST