దేశం విడిచి వెళ్లిపోయిన బిజినెస్‌మేన్.. రెండేళ్ల తర్వాత బయటపడ్డ 350 కోట్ల మోసం!

ABN , First Publish Date - 2020-07-04T02:44:09+05:30 IST

ఓ బిజినెస్‌మేన్ ఇటీవల దేశం విడిచి వెళ్లాడు. కానీ అతను వెళ్లాక బయటపడ్డ విషయం తెలిసి అందరూ షాకయ్యారు.

దేశం విడిచి వెళ్లిపోయిన బిజినెస్‌మేన్.. రెండేళ్ల తర్వాత బయటపడ్డ 350 కోట్ల మోసం!

చండీగఢ్: ఓ బిజినెస్‌మేన్ ఇటీవల దేశం విడిచి వెళ్లాడు. కానీ అతను వెళ్లాక బయటపడ్డ విషయం తెలిసి అందరూ షాకయ్యారు. ఎందుకంటే సదరు బిజినెస్‌మేన్ విదేశాలకు వెళ్లే ముందు బ్యాంకులను రూ.350 కోట్లకు మోసం చేశాడు. ఈ విషయాన్ని సీబీఐ శుక్రవారం వెల్లడించింది. పంజాబ్ బాస్మతి రైస్ సంస్థ డైరెక్టర్ మంజీత్ సింగ్ మాఖ్ని ఇటీవల విదేశాలకు వెళ్లిపోయాడు. అతను వెళ్లే ముందు కెనరా బ్యాంకు కన్సార్షియంలోని ఆరుబ్యాంకుల నుంచి రూ.350కోట్ల సొమ్ము అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత ఎవరికీ చెప్పకుండా ధాన్యం నిల్వలు, బ్యాంకులో ఇచ్చిన సెక్యూరిటీని సదరు బ్యాంకులకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా మాయంచేశాడు. అనంతరం విదేశాలకు పారిపోయాడు. మంజీత్ సింగ్ విదేశాలకు వెళ్లిపోయిన రెండేళ్ల తర్వాత ఈ కుంభకోణం వెలుగుచూసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న సీబీఐ.. మంజీత్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తోంది.

Updated Date - 2020-07-04T02:44:09+05:30 IST