ప్రయాణికుల అగచాట్లు
ABN , First Publish Date - 2020-05-23T10:48:31+05:30 IST
కరోనా వైరస్ నివారణలో భాగంగా ఒంగోలు ఆర్టీసీ డిపో నుంచి శుక్రవారం కూడా ఏ ఒక్క బస్సు
ఒంగోలుకు రాని బస్సులు
బైపాస్ నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు
ఒంగోలు (ప్రగతిభవన్) మే22: కరోనా వైరస్ నివారణలో భాగంగా ఒంగోలు ఆర్టీసీ డిపో నుంచి శుక్రవారం కూడా ఏ ఒక్క బస్సు నడవలేదు. అయితే ప్రయాణికులు మాత్రం బస్సుల వివరాలు తెలుసుకునేందుకు డిపోకు వస్తూనే ఉన్నారు. ప్రధానంగా విజయవాడ, గుం టూరు, నెల్లూరు ప్రాంతాలకు ప్రయాణించడానికి ఆన్లైన్లో టికెట్ నమోదు చేసుకున్న వారు మాత్రమే మండు టెండలో స్థానిక కర్నూల్రోడ్డు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకుని బస్సులు ఎక్కుతున్నారు. అంతేగాకుండా బస్సులోని ప్రయాణికుల వివరాలను సిబ్బంది ప్రత్యేకంగా నమోదు చేసుకుంటున్నారు. ఇక జిల్లాలోని ఇతర డిపోల నుంచి కేవలం జిల్లా వరకు మాత్రమే 50 సర్వీసులు తిరిగాయి. భౌతికదూరం పాటిస్తూ శానిటైజర్ను ఉపయోగిస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నట్లు అధికారులు తెలిపారు.