వాతావరణ పరిరక్షణకు బస్‌ యాత్ర

ABN , First Publish Date - 2022-05-23T06:51:11+05:30 IST

వాతావరణ పరిరక్షణకు ప్రారం భించిన ఎనర్జీ స్వరాజ్‌ సోలార్‌ బస్సు యాత్ర 2030 డిసెం బరు వరకూ భారతదేశం నలుమూలల నిర్వహిస్తామని ఐఐటీ బొంబే ప్రొఫెసర్‌ చేతన్‌సింగ్‌ సోలంకి తెలిపారు.

వాతావరణ పరిరక్షణకు బస్‌ యాత్ర

ఐఐటీ బొంబే ప్రొఫెసర్‌  చేతన్‌సింగ్‌ సోలంకి

దివాన్‌చెరువు, మే 22 : వాతావరణ పరిరక్షణకు ప్రారం భించిన ఎనర్జీ స్వరాజ్‌ సోలార్‌ బస్సు యాత్ర 2030 డిసెం బరు వరకూ భారతదేశం నలుమూలల నిర్వహిస్తామని ఐఐటీ బొంబే ప్రొఫెసర్‌  చేతన్‌సింగ్‌ సోలంకి తెలిపారు.  రాజమహేంద్రవరం శ్రీ గౌతమి పాఠశాల గ్రౌండ్‌లో ఆదివా రం దాదాపు రెండు గంటల పాటు ప్రజల సందర్శనకు బస్‌ను ఉంచారు. సందర్శకులకు బస్సు విశిష్టతను వివ రించారు. దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా నవంబర్‌ 2020లో  ఈ యాత్ర ప్రారంభించామన్నారు. రకరకాల ఇందన వినియోగం వాటి వల్ల కాలుష్యం.. అన్నిరకాల జంతు జాలాలు మనుషులపై ఏర్పడు దుష్ప్రభావాలు మొదలగు అంశాలను తెలిపారు. ఇప్పటి వరకూ మూడు రాష్ట్రాల్లోని  5 వేల కిలోమీటర్లు ప్రయాణించి 15 వేల మందికి చేరు వైనట్టు తెలిపారు. భవిష్యత్‌ యాత్ర ప్రణాళికలో భాగంగా 2030 నాటికి 28  రాష్ట్రాల్లో 2 లక్షల కిలోమీటర్లు దూరం ప్రయాణించాలన్నదే ఆశయమన్నారు. ఈ సౌరశక్తి ఉద్య మంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని శ్రీ గౌతమి విద్యాసంస్థల కార్యదర్శి, కరస్పాండెంట్‌ సుంకర రవికుమార్‌ తెలిపారు.  



Updated Date - 2022-05-23T06:51:11+05:30 IST