బస్సు బ్యాలెన్స్‌

ABN , First Publish Date - 2022-08-15T06:18:23+05:30 IST

బస్సు బ్యాలెన్స్‌

బస్సు బ్యాలెన్స్‌

విశాఖ-హైదరాబాద్‌ బస్సుకు తప్పిన ప్రమాదం

జగ్గయ్యపేట రూరల్‌, ఆగస్టు 14 : జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న  ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు షేర్‌మహ్మద్‌పేట వై జంక్షన్‌ వద్ద ముందుగా వెళ్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న గొయ్యిలోకి సగం వరకూ వెళ్లి ఆగిపోయింది. ఎదురుగా వెళ్తున్న లారీ ఎటువంటి సిగ్నల్స్‌ లేకుండా ఒక్కసారిగా కుడివైపునకు తిరగటంతో వెనుకగా వస్తున్న బస్సు అదుపు తప్పి   రోడ్డు వారగా దిగిపోయింది. బస్సు పల్టీ కొట్టి ఉంటే  పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అయితే డ్రైవర్‌ అప్రమత్తం కావడంతో రోడ్డు పక్కనే గొయ్యిలో బ్యాలెన్స్‌ చేస్తూ గాలిలో ఉండిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్‌ బత్తుల గురవయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే పోలీసులు అక్కడకు చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. ప్రయాణికులు వేర్వేరు వాహనాల్లో వెళ్లిపోయారు.


Updated Date - 2022-08-15T06:18:23+05:30 IST